విరాట్ కోహ్లీ అంటే నాకేం భయం లేదు: పాకిస్థాన్ పేసర్

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని ఎదుర్కొనేందుకు తనకి ఎలాంటి భయంలేదని పాకిస్థాన్ యువ ఫాస్ట్ బౌలర్ నషీమ్ షా ధీమా వ్యక్తం చేశాడు. 16 ఏళ్ల వయసులోనే టెస్టు క్రికెట్లోకి అరంగేట్రం చేసిన నషీమ్.. బంగ్లాదేశ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో హ్యాట్రిక్ వికెట్లతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అంతేకాకుండా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్లో ఒకే ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు పడగొట్టిన నషీమ్.. ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు.